ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ - పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
శాసనసభలో మంగళవారం ఉదయం పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఈ బిల్లును సభ ముందుంచారు.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించి, ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కొత్తగా 4వ నగరాన్ని అభివృద్ది చేస్తాం - శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్
Comments
Post a Comment